News13th Apr 11:35 AMSunil Byrisetty1 min read
40 ఏళ్ల ముందు ఎన్టీఆర్.. నేడు లోకేష్!
మంత్రి నారా లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరిలో వంద పడకల ఆస్పత్రికి భూమిపూజ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిలోపు ఆస
మంత్రి నారా లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరిలో వంద పడకల ఆస్పత్రికి భూమిపూజ చేశారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు.
ఏడాదిలోపు ఆస్పత్రికి పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
కార్పొరేట్, మల్టీ స్పెషాలిటీకి దీటుగా అత్యాధునిక వసతులతో ఏడాదిలోగా పూర్తిచేసేలా అడుగులు వేస్తున్నారు.
సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే మంగళగిరి నియోజకవర్గంలో 30 పడకల ఆస్పత్రికి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు.
మళ్లీ అదే నియోజకవర్గంలో 40 ఏళ్ల తర్వాత వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఎన్టీఆర్ మనవడు, మంత్రి లోకేష్ పూనుకున్నారు.