News25th Apr 05:02 PMSunil Byrisetty1 min read
పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన
పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చ
పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రూ.34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ఆసుపత్రిలో రెండు కొత్త బ్లాకులు, ఓపీ వార్డు, మార్చురీ వార్డు, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రి నిర్మాణం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని 3 లక్షల మంది ప్రజలతోపాటు ఆరు పరిసర మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్టు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలోనే నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు.