News7th Nov 03:37 PMSunil Byrisetty1 min read
102 బస్సులు సీజ్.. 604 బస్సులపై కేసులు!
కర్నూలులో బస్సు దహనమైన ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రభుత్వం ప్రైవేట్ బస్సు భద్రతపై కఠిన చర్యలు తీసుకుంది. మొత్తం 12 బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహించి, అత్యవసర నిష్
కర్నూలులో బస్సు దహనమైన ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రభుత్వం ప్రైవేట్ బస్సు భద్రతపై కఠిన చర్యలు తీసుకుంది. మొత్తం 12 బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహించి, అత్యవసర నిష్క్రమణ, అగ్నిమాపక యంత్రం వంటి భద్రతా లక్షణాలను పరిశీలించారు. కర్ణాటకలో 4,452 బస్సులను తనిఖీ చేసి, 604పై కేసులు నమోదు చేయగా, 102 బస్సులు సీజ్ చేశారు. భద్రతా చర్యలు పాటించని అన్ని ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్కు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. అదనపు రవాణా కమిషనర్ నేతృత్వంలో బెంగళూరు నగరం, గ్రామీణ ప్రాంతాల్లో సైతం బస్సులను తనిఖీ చేయడానికి మొత్తం 12 బృందాలను ఏర్పాటు చేశారు. ,452 ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసి 604 బస్సులపై కేసులు నమోదు చేశారు. 102 బస్సులను సీజ్ చేశారు. ఈ బస్సుల నుండి పన్ను, జరిమానా రూపంలో రూ.1,09,91,284 జరిమానా వసూలు చేశారు. మొత్తం మీద కర్నూలు ఘటనతో అప్రమత్తమైన రవాణా శాఖ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి, భద్రతా చర్యలు పాటించని బస్సులపై చర్యలు తీసుకుంటున్నారు.