News27th Jun 12:22 PMSunil Byrisetty1 min read
టీచర్ల వాహనం బోల్తా.. 13 మందికి గాయాలు
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.ఉరవకొండ మండలం కోనాపురం వద్ద శుక్రవారం ఉదయం ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులకు
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.ఉరవకొండ మండలం కోనాపురం వద్ద శుక్రవారం ఉదయం ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలు కాగా, మరో 11 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రతిరోజూ అనంతపురం నుంచి 13 మంది ఉపాధ్యాయులు ఈ వాహనంలో పాఠశాలలకు వెళ్తుంటారు.