News27th Nov 01:44 PMSunil Byrisetty1 min read

ఏపీలో 15,462 రోడ్డు ప్రమాదాలు.. 6,433 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ లో రహదారి ప్రామాణాల నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రోడ్డు ప్రమాదాలు, తద్వారా సంభవిస్తున్న మరణాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులన

ఏపీలో 15,462 రోడ్డు ప్రమాదాలు.. 6,433 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో రహదారి ప్రామాణాల నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రోడ్డు ప్రమాదాలు, తద్వారా సంభవిస్తున్న మరణాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి రోడ్డు ప్రమాదంపైనా థర్డ్ పార్టీతో ఆడిట్ చేయించి, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో సచివాలయంలో ఆయన రోడ్ సేఫ్టీ కౌన్సిల్‌తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, రవాణా శాఖ కమిషనర్ మనీశ్‌ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటివరకు 15,462 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 6,433 మంది మరణించారని ముఖ్యమంత్రికి వివరించారు.
Andhra Pradesh
Road accidents
Road safety
Chandrababu Naidu
High-level review
Road Safety Council
DGP Harish Kumar Gupta
ప్రమాద నివారణ చర్యలు
ప్రభుత్వ సమీక్ష
ప్రజా భద్రత
Scroll for the next article