International3rd Jun 11:54 AMSunil Byrisetty1 min read
పాక్కు షాక్.. జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్!
పాకిస్థాన్లో విచిత్రం చోటు చేసుకుంది. కరాచీ జైలు నుంచి ఏకంగా 200 మంది ఖైదీలు తప్పించుకున్నారు. సోమవారం అర్ధరాత్రి జైలు అధికారులపై దాడి చేసి, మెయిన్ గేటు బద్దలు కొట్టుకుని పరారయ్యా
పాకిస్థాన్లో విచిత్రం చోటు చేసుకుంది. కరాచీ జైలు నుంచి ఏకంగా 200 మంది ఖైదీలు తప్పించుకున్నారు. సోమవారం అర్ధరాత్రి జైలు అధికారులపై దాడి చేసి, మెయిన్ గేటు బద్దలు కొట్టుకుని పరారయ్యారు. ఈ దాడిలో పలువురు పోలీస్ ఆఫీసర్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, తప్పించుకున్న ఖైదీల కోసం పోలీసులు వెతుకుతున్నారు. దీంతో కరాచీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా పారిపోయిన ఖైదీలంతా కరుడుగట్టిన క్రిమినల్స్ అని తెలుస్తోంది. జైలులో ఖైదీలపైనే నిఘా పెట్టలేని పాకిస్థాన్ యుద్ధం ఏం చేస్తుందంటూ ట్రోల్ అవుతోంది.