International1st Sep 11:08 AMSunil Byrisetty1 min read
షేకైన ఆఫ్గాన్.. భారీ భూకంపం!
ఆఫ్గానిస్థాన్ షేకయింది. భారీ భూకంపం సంభవించడంతో వణికిపోయింది. పాకిస్థాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ విపత్తు కారణంగా 250 మంది మృతి చెంద
ఆఫ్గానిస్థాన్ షేకయింది. భారీ భూకంపం సంభవించడంతో వణికిపోయింది. పాకిస్థాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ విపత్తు కారణంగా 250 మంది మృతి చెంది ఉంటారని అంచనా వేస్తున్నారు. 500 మంది వరకు గాయపడి ఉంటారని సమాచారం. యూఎస్ జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం.. నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.