News3rd Nov 11:15 AMSunil Byrisetty1 min read
భయం భయం.. 10 రోజుల్లో 60 మంది దుర్మరణం!
దేశవ్యాప్తంగా ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత పది రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో జర
దేశవ్యాప్తంగా ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత పది రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించారు. ఇంతకుముందు కర్నూలులో బస్సు దహనమై 20 మంది మృతి చెందారు. నిన్న రాజస్థాన్లో టెంపో, బస్సు ఢీకొనడంతో 15 మంది చనిపోయారు. నేడు బాపట్లలోని సత్యవతిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు ప్రయాణ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రయాణికుల్లో ప్యానిక్ పరిస్థితిని రేపుతున్నాయి.