News27th Aug 05:11 PMSunil Byrisetty1 min read
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 65వ సీఆర్డీఏ సమావేశం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 65వ సీఆర్డీఏ సమావేశం నిర్వహించారు. వివిధ పరిపాలన అనుమతులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. రూ.1430కోట్లతో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 65వ సీఆర్డీఏ సమావేశం నిర్వహించారు. వివిధ పరిపాలన అనుమతులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. రూ.1430కోట్లతో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రూ.596 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదించింది. ఎల్పీఎస్ రోడ్లను సీసీకి బదులు బీటీ రోడ్లే వేస్తామని పేర్కొంది. 29 గ్రామాల లే ఔట్ రోడ్లు బీటీ చేసేందుకు ఆమోదం తెలిపింది. మంగళగిరికి అమరావతి నుంచి తాగునీటి సరఫరాకు అంగీకారం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి నారాయణ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్కు అంగీకారం తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి ఆమోదం తెలిపారు. ఐవోసీఎల్ గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి ఆమోదం తెలిపారు. రెండో దశ భూసమీకరణ రైతులకూ రుణమాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు.