TTD9th Jan 01:08 PMSunil Byrisetty1 min read

7.83 లక్షల మందికి వైకుంఠద్వార దర్శనం

వైకుంఠద్వార దర్శనాలపై టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది వైకుంఠద్వార దర్శనాలు అత్యంత అద్భుతంగా నిర్వహించామన్నారు.వైకుంఠద్వార దర్శనాల్లో 93 శాతం మంది భక్తులు

7.83 లక్షల మందికి వైకుంఠద్వార దర్శనం
వైకుంఠద్వార దర్శనాలపై టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది వైకుంఠద్వార దర్శనాలు అత్యంత అద్భుతంగా నిర్వహించామన్నారు.వైకుంఠద్వార దర్శనాల్లో 93 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. 2023లో 6 లక్షల 47 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే.. 2024లో 6లక్షల 83వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని వివరించారు. ఈ ఏడాది అత్యధికంగా 7.83 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని, 10 రోజుల్లో శ్రీవారికి రూ.41.14 కోట్ల కానుకలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ సారి వైకుంఠద్వార దర్శనాల్లో 44 లక్షల లడ్డూలు విక్రయించామన్నారు. గతేడాది కంటే 27% అధికంగా భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశామని తెలిపారు. శ్రీవారి అలంకరణకు 50 టన్నుల పుష్పాలు వినియోగించినట్లు చెప్పారు. 2 లక్షలకు పైగా భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు గణాంకాలు వివరించారు.
Andhra Pradesh
Vaikunta Dwara Darshan
TTD
Tirumala
Lord Venkateswara
.ఆర్. నాయుడు
భక్తుల గణాంకాలు
తిరుపతి
ఆధ్యాత్మిక భారత్
Scroll for the next article