News10th Jul 10:20 AMSunil Byrisetty1 min read

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 19వ SIPB, CRDA నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.ఈ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొందనున్న ముఖ్య ప్ర

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 19వ SIPB, CRDA నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.ఈ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొందనున్న ముఖ్య ప్రతిపాదనల వివరాలు ఇలా.. రూ.9 వేల కోట్ల పెట్టుబడులతో కూడిన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 10 వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.అమరావతిలో రెండో విడత భూసమీకరణ చేస్తున్న ఏడు గ్రామాల రైతులకు రుణమాఫీ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ రుణమాఫీ కింద ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసే ప్రతిపాదనకు ఆమోదం లభించనుంది. 307 ఎకరాల ఇనాం భూములకు సంబంధించి, దేవాదాయ శాఖకు రూ.159 కోట్ల పరిహారం చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
Andhra Pradesh Cabinet
AP Cabinet Meeting
N. Chandrababu Naidu
SIPB
CRDA
Amaravati
Investment Projects
Job Creation
రుణమాఫీ
అమరావతి రైతులు
దేవాదాయ శాఖ
ఇనాం భూములు
Scroll for the next article