National4th Jun 09:08 AMSunil Byrisetty1 min read
స్కూటర్పై తల్లితో సంకల్పయాత్ర
ఆలయాలను సందర్శించాలనే తల్లి ఆకాంక్షను తీర్చేందుకు 98 వేల కిలోమీటర్లు స్కూటర్ పై తీసుకెళ్ళాడీ కుమారుడు. పాత బజాజ్ చేతక్ స్కూటర్ నడుపుతూ కొడుకు.. వెనుక సీటుపై అమ్మ.. ఒకటీ రెండూ కా
ఆలయాలను సందర్శించాలనే తల్లి ఆకాంక్షను తీర్చేందుకు 98 వేల కిలోమీటర్లు స్కూటర్ పై తీసుకెళ్ళాడీ కుమారుడు. పాత బజాజ్ చేతక్ స్కూటర్ నడుపుతూ కొడుకు.. వెనుక సీటుపై అమ్మ.. ఒకటీ రెండూ కాదు, ఇలా 98వేల కిలోమీటర్లు తిరిగి తిరుమలకు వచ్చారు ఈ తల్లీకుమారులు. దక్షిణామూర్తి కృష్ణకుమార్ది మైసూరు. బెంగళూరులోని ఒక కార్పొరేట్ సంస్థలో టీం లీడర్గా ఉద్యోగం. 2015లో తండ్రి చనిపోవడంతో అమ్మను బెంగళూరుకు తీసుకువచ్చాడు. ఉద్యోగం చేస్తూ అమ్మకి ఆలయాలన్నీ చూపించడం సాధ్యం కాదని అతనికి అర్థమైంది. 2018లోనే రూ.60 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. 2018 జనవరి 16న తన బజాజ్ స్కూటర్ మీదే 'మాతృ సేవా సంకల్ప యాత్ర' ప్రారంభించాడు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీ్సగఢ్, ఒడిశా, ఝార్ఖండ్, బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సోం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, మణిపుర్, మిజోరాం, అరుణాచల్ప్రదేశ్.. ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ తల్లితో స్కూటర్పై తిరుగుతున్నాడు ఈ 45 ఏళ్ల కుమారుడు. నేపాల్, భూటాన్కూ తల్లితో స్కూటర్పైనే వెళ్లాడు. ఇప్పటికి 98,109 కిలోమీటర్లు ప్రయాణించాడు. తిరుమలకు చేరుకుని తల్లి చూడరత్నమ్మతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నాడు. తన సంకల్పయాత్రకు అవరోధం కాకూడదని కృష్ణకుమార్ పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకీ త్యాగం? అని అడిగితే, 'చనిపోయాక శ్రాద్ధకర్మలు ఘనంగా చేయడం కాదు.. బతికి ఉన్నపుడు సంతోషపెట్టడమే కొడుకుగా నా బాధ్యత' అని సమాధానం ఇచ్చాడు.