Education22nd Jul 03:33 PMSunil Byrisetty1 min read

మెగా పీటీఎంకు రూ. 9.98 కోట్లు

రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈ నెల 24న జరగనున్న ‘‘మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (MPTM 3.1)’’ నిర్వహణ కోసం రూ. 9.98 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేసినట్లు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి. శ్

మెగా పీటీఎంకు రూ. 9.98 కోట్లు
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈ నెల 24న జరగనున్న ‘‘మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (MPTM 3.1)’’ నిర్వహణ కోసం రూ. 9.98 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేసినట్లు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ నిధులను సమగ్ర శిక్ష జిల్లాల అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ల (APC) ఖాతాలకు జమ చేశామని తెలిపారు. సమగ్ర శిక్ష జిల్లాల అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు ఆ నిధులను బుధవారం సాయంత్రం 4 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధిత పాఠశాలల ఖాతాలకు బదిలీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిధుల విడుదలలో ఎలాంటి ఆలస్యం వహించరాదని హెచ్చరించారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు మెగా పీటీఎం నిర్వహణ ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని కోరారు.
Andhra Pradesh Schools
Mega PTM
Parent Teacher Meeting
MPTM 3.1
Samagra Shiksha
School Education
B Srinivasa Rao
విద్యా కార్యక్రమం
పాఠశాల బడ్జెట్
ఉపాధ్యాయులు
తల్లిదండ్రులు
Scroll for the next article