News3rd Apr 09:39 AMSunil Byrisetty1 min read
గంగానమ్మ అమ్మవారికి లక్ష గారెల నివేదన
కృష్ణాజిల్లా కోడూరు మండలం కోడూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవాలయంలో లక్ష గారెల మహా నివేదన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అమ్మవారి 50వ మహా జాతర కార్యక్రమాలన
కృష్ణాజిల్లా కోడూరు మండలం కోడూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవాలయంలో లక్ష గారెల మహా నివేదన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
అమ్మవారి 50వ మహా జాతర కార్యక్రమాలను పురస్కరించుకొని ఈ వినూత్న కార్యక్రమానికి దేవస్థానం ట్రస్టీలు, భక్తులు పూనుకునన్నారు.
ఈరోజు అమ్మవారికి ఒక లక్ష గారెలుతో మహా నివేదన, మహా చండీయాగం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము.
కోడూరు వెళ్లడానికి విజయవాడ, రేపల్లె, గుడివాడ, మచిలీపట్నం నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.