National26th Aug 12:25 PMSunil Byrisetty1 min read
5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. ఆప్ సంచలనం
దేశవ్యాప్తంగా E20 కలిపిన పెట్రోల్ వినియోగంపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. గోవాలో ఆప్ ను గెలిపిస్తే E20 పెట్రోల్ను బ్యాన్ చేస్తామని ఆ పార్టీ చీఫ
దేశవ్యాప్తంగా E20 కలిపిన పెట్రోల్ వినియోగంపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. గోవాలో ఆప్ ను గెలిపిస్తే E20 పెట్రోల్ను బ్యాన్ చేస్తామని ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ప్రకటించారు. 'గోవాలో మా ప్రభుత్వం ఏర్పడితే 2027 మార్చి 10 తర్వాత ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అమ్మకాలను 5 రోజుల్లోగా నిషేధిస్తామని చెప్పారు. అలా చేయకపోతే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఇంజిన్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే E20 వల్లే చక్కెర ధరలూ పెరుగుతున్నాయని వ్యాఖ్యా నించారు. E20పై ఆప్ జాతీయ స్థాయి ప్రచారం చేపట్టింది.