Business Type11th Jun 03:27 PMSunil Byrisetty1 min read
ఏసీలపై కేంద్రం కొత్త రూల్..!
దేశంలో ఏసీల వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కేంద్రం కొత్త నిబంధన తీసుకు రావాలని నిర్ణయించింది. ఏసీల వినియోగానికి సంబంధించి ఇక నుంచి కొత్త రూల్స్ తీసుకురాబోతున్నట్లు కేంద్రమంత్ర
దేశంలో ఏసీల వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కేంద్రం కొత్త నిబంధన తీసుకు రావాలని నిర్ణయించింది. ఏసీల వినియోగానికి సంబంధించి ఇక నుంచి కొత్త రూల్స్ తీసుకురాబోతున్నట్లు కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ వెల్లడించారు. ' ఏసీ టెంపరేచర్స్ 20° - 28° డిగ్రీల మధ్యే ఉండేలా స్టాండర్డ్ టెంపరేచర్ సెట్టింగ్స్ తీసుకొస్తామని వెల్లడించారు. అంటే యూజర్లు 20° కంటే తక్కువ, 28° కంటే ఎక్కువ టెంపరేచర్ పెట్టే అవకాశం ఉండదు. దీనిపై తయారీదారులతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్ ఆదాతో పాటు కర్బన సంబంధ వ్యర్థ పదార్థ ఉత్పత్తిని తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు.