News20th Apr 10:34 AMSunil Byrisetty1 min read
పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులను దూషించడంపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ కేసులో శ్రీరెడ్డిని విజయనగరం జిల
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులను దూషించడంపై కేసులు నమోదయ్యాయి.
తాజాగా ఆ కేసులో శ్రీరెడ్డిని విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.
గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆమెపై కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలో ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారిస్తున్నారు.
కాగా ఇప్పటికే శ్రీరెడ్డి కూటమి నాయకులకు క్షమాపణలు చెప్పినా కూటమి నేతలు, కార్యకర్తలు మాత్రం తగ్గడం లేదు.
ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.