News25th Aug 03:49 PMSunil Byrisetty1 min read
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత టీడీపీదే
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ 1995లో రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బలహీన వర్గాలకు 20 శాతం రిజర్వేషన్ సరిపోదని, సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు 34 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకున్నారని వివరించారు. నాటి నుంచి 1995, 2001, 2009, 2013లో ఈ రిజర్వేషన్లు పోలేదని గుర్తు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాకే 34 శాతం నుంచి 24 శాతానికి రిజర్వేషన్లు ఎందుకు తగ్గాయో వైసీపీ బీసీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే బలహీన వర్గాల గురించి మాట్లాడాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో హడావుడిగా ఎన్నికలు తెచ్చి బీసీలకు అన్యాయం చేశారని, అందువల్ల బీసీలకు 16000 పదవులు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాటి చట్టం ప్రకారం 34 శాతానికి బీసీ రిజర్వేషన్లు పెంచి జీవో ఇచ్చామని అచ్చెన్నాయుడు వివరించారు.