News26th Jun 04:05 PMSunil Byrisetty1 min read

శక్తిమంతమైన ప్రభుత్వంతో అభివృద్ధి

ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరం అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమన్నారు. అఖండ గోదావరి ప్

శక్తిమంతమైన ప్రభుత్వంతో అభివృద్ధి
ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరం అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తీరం వెంట నాగరికత, భాష అన్నీ అభివృద్ధి చెందుతాయని చెప్పారు. "ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతో మంది కళాకారులకు జన్మనిచ్చిన నేల ఇది. ఎంతో కాలంగా ఉన్న కలను సాకారం చేసే దిశగా ముందుకెళ్లడం ఆనందదాయకం. పర్యటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యటకులు పెరిగే అవకాశముంది. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుంది" అని పవన్ కల్యాణ్ చెప్పారు.
Andhra Pradesh news
Rajamundry
Pawan Kalyan
Dokka Seethamma
tourism sector
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన
Scroll for the next article