Politics28th Dec 03:45 PMSunil Byrisetty1 min read
తిరుమలపై మళ్లీ ఆరోపణలు
పవిత్రమైన తిరుమలపై మళ్ళీ వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అక్కడ అసాంఘిక కార్య కలాపాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ప్రతిష్టాత్మక తిరుమల కొండపై బళ్లారి ఎమ్మెల్య
పవిత్రమైన తిరుమలపై మళ్ళీ వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అక్కడ అసాంఘిక కార్య కలాపాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ప్రతిష్టాత్మక తిరుమల కొండపై బళ్లారి ఎమ్మెల్యే ఫోటోషూట్ జరుగుతుంటే వ్యవస్థ ఏమి చేస్తోందని నిలదీశారు. గోశాల నిర్వహణలో 191 ఆవులు మరణించడం చాలా బాధాకరమని చెప్పారు. ఇవే విషయాలను ఎత్తిచూపితే తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్డీయే శ్రేణులు మండిపడుతున్నాయి.