News3rd Oct 01:40 PMSunil Byrisetty1 min read

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. సీఎం సీరియస్

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగ

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. సీఎం సీరియస్
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దోషులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. దేవళంపేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆనుకుని ఉన్న ఓ షెడ్డుకు కొందరు ఆగంతుకులు రాత్రి నిప్పు పెట్టారు. ఈ మంటలు క్రమంగా విగ్రహానికి వ్యాపించడంతో విగ్రహం పాక్షికంగా దెబ్బతింది. విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh
CM Chandrababu Naidu
Chittoor
Ambedkar statue
arson
Dalit community
police action
vandalism
investigation
పోలీస్ చర్యలు
చిత్తూరు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు
Scroll for the next article