News7th May 04:16 PMSunil Byrisetty1 min read

అమిత్ షా అత్యవసర సమీక్ష.. రేపు అఖిలపక్షం

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వం అలర్టైంది. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌పై దెబ్బకు దెబ్బతీసిన భారత్ తదుపరి చర్యలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్

అమిత్ షా అత్యవసర సమీక్ష.. రేపు అఖిలపక్షం
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వం అలర్టైంది. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌పై దెబ్బకు దెబ్బతీసిన భారత్ తదుపరి చర్యలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలో అత్యవసర సమీక్ష చేపట్టారు. పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎస్‌లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమీక్ష సమావేశానికి జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం సీఎంలు హాజరయ్యారు. లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈ సమీక్షలో  పాల్గొన్నారు. రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని పార్టీలతో చర్చించి పోరుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Operation Sindoor
Home Minister Amitshah
India Strikes Pakistan
Pahalgam attack
అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలో అత్యవసర సమీక్ష
రేపు అఖిలపక్ష సమావేశం
జమ్ముకశ్మీర్
పంజాబ్
రాజస్థాన్
ఉత్తరాఖండ్
గుజరాత్
ఉత్తరప్రదేశ్
Scroll for the next article