Politics10th Apr 12:35 PMSunil Byrisetty1 min read
కూటమి ప్రభుత్వంలో రైళ్ల పరుగులు
NDA కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చర్యలు వేగవంతం అవుతున్నాయని వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తిరుపతి-కాట్పాడి రైల్వేలైన్ డబ్లింగ్ ప్రాజెక్టు ఆమోదంపై ప్రధాన
NDA కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చర్యలు వేగవంతం అవుతున్నాయని వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
తిరుపతి-కాట్పాడి రైల్వేలైన్ డబ్లింగ్ ప్రాజెక్టు ఆమోదంపై ప్రధాని నరేంద్రమోదీకి, రైల్వేమంత్రి అశ్విన్ శ్రీ వైష్ణవ్కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట అనుసంధానంతో పాటు వెల్లూరు, తిరుపతి వంటి విద్య, వైద్య కేంద్రాలకు ప్రాజెక్టు ఎంతో మేలు చేకూర్చుతుంది.
ఈ ప్రాజెక్టు వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థను బలపరచడంతో పాటు ఏపీలో ఎలక్ట్రానిక్స్, సిమెంట్, ఉక్కు పరిశ్రమల వృద్ధిని వేగవంతం చేస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఈ రైల్వే లైన్తో ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక మధ్య రైల్వే రవాణా వేగం కూడా పెరగనుంది