Sports19th Aug 04:24 PMSunil Byrisetty1 min read
ఆంధ్రప్రదేశ్ అంధుల క్రికెట్ జట్టుకు ఎంపికలు
ఆంధ్రప్రదేశ్ అందుల క్రికెట్ జట్టు కోసం ఆటగాళ్ల ఎంపికలు (సెలక్షన్స్) రేపటి నుంచి, అంటే ఆగస్టు 20 నుండి 22 వరకు, గుంటూరులోని పిచ్చుకల గుంట మైదానంలో జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని క్రికె
ఆంధ్రప్రదేశ్ అందుల క్రికెట్ జట్టు కోసం ఆటగాళ్ల ఎంపికలు (సెలక్షన్స్) రేపటి నుంచి, అంటే ఆగస్టు 20 నుండి 22 వరకు, గుంటూరులోని పిచ్చుకల గుంట మైదానంలో జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (CABAP), VCEA, మరియు DCCAP సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. గత జూలైలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 44 మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఈ ఎంపికల్లో పాల్గొంటారు. ఈ ఎంపికల నిర్వహణకు ఐటీసీ గుంటూరు మరియు ఎల్.వి.ఆర్. & సన్స్ క్లబ్ రీడింగ్ రూమ్ గుంటూరు స్పాన్సర్షిప్ చేస్తున్నాయని గుంటూరు జిల్లా బ్లైండ్ క్రికెట్ ఇంచార్జ్ కె. శ్రీనివాసరావు తెలిపారు. మరిన్ని వివరాల కోసం, దయచేసి 9705401300 నంబర్ను సంప్రదించగలరు.