News17th Aug 12:18 PMSunil Byrisetty1 min read
ఏపీ కేబినెట్ భేటీ 21న
కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 21వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు మంత్రులు, కార్యదర్శులకు సాధారణ పరిపాలన శాఖ సమాచారం అందజేసిం
కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 21వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు మంత్రులు, కార్యదర్శులకు సాధారణ పరిపాలన శాఖ సమాచారం అందజేసింది. ఈనెల 19వ తేదీ నాటికి కేబినెట్ సమావేశానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ భేటీలో పలు కీలక ప్రాజెక్టులు, కేటాయింపులకు ఆమోదం తెలపనున్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలు, వ్యయం, సంతృప్తస్థాయిపైనా చర్చిస్తారు.