Education10th Apr 12:41 PMSunil Byrisetty1 min read

22న ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదల

పదో తరగతి విద్యార్థులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న పరీక్షా ఫలితాలపై క్లారిటీ వచ్చేసింది. ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల తేదీని ఖరారు చేశారు. ఈనెల 22న ఫలితాలు విడుదల

22న ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదల
పదో తరగతి విద్యార్థులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న పరీక్షా ఫలితాలపై క్లారిటీ వచ్చేసింది. ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల తేదీని ఖరారు చేశారు. ఈనెల 22న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు 3,500 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు రాశారు. ఏప్రిల్ 15 నాటికి మూల్యాంకనం ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటికే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది.
Andhra Pradesh
10th Class Examination Results
April 22nd
పరీక్షా ఫలితాలు
పదో తరగతి పరీక్షలు
ఏపీ ప్రభుత్వం
Scroll for the next article