Education14th May 11:41 AMSunil Byrisetty1 min read
గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచిన ప్రభుత్వం
ఏపీలో సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తు్న్న గెస్ట్ లెక్చరర్ల జీతాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూ
ఏపీలో సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తు్న్న గెస్ట్ లెక్చరర్ల జీతాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
వారికి జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం గంటకు ఇస్తున్న రూ. 150 పారితోషికాన్ని రూ.375కు పెంచగా, నెలకు అత్యధికంగా రూ.27,000గా నిర్ణయించింది.
తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
దీంతో గెస్ట్ లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.