News8th May 12:10 PMSunil Byrisetty1 min read
ఏపీలో గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనాలు పెంపు
ఏపీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫ్యాకల్టీ) వేతనాల పెంపునకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గంటకు రూ.150 చొప్పున నెలకు గరిష్ఠంగా
ఏపీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫ్యాకల్టీ) వేతనాల పెంపునకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం గంటకు రూ.150 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.10,000 ఇవ్వాలనే నిబంధన ఉంది.
దాన్ని గంటకు రూ.375 చొప్పున గరిష్ఠంగా నెలకు రూ.27,000 ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది.
దీంతో గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనాలు పెరగనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా అతిథి అధ్యాపకులు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తు్న్నారు.