News11th Aug 09:08 AMSunil Byrisetty1 min read
జిల్లాల మార్పులపై ప్రభుత్వం కసరత్తు
రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్
రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచన చేస్తోంది. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశంలోకి మార్పు చేయాలని భావిస్తోంది. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలు వచ్చే అవకాశం ఉంది. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం పాలనా సౌలభ్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది.