News24th Oct 05:24 PMSunil Byrisetty1 min read
అర్హులైన వారికి 2 లేదా 3 సెంట్ల స్థలం ఇస్తాం
అర్హులైన వారికి ఇళ్లు, ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. అర్హులైన వారికి 2 లేదా 3 సెంట్ల స్థలం ఇవ్వటానికి కేబినెట్ సబ్ క
అర్హులైన వారికి ఇళ్లు, ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. అర్హులైన వారికి 2 లేదా 3 సెంట్ల స్థలం ఇవ్వటానికి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిందన్నారు. - కొన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని గత ప్రభుత్వం చెప్పింది కానీ.. ఎవరికి ఇళ్లస్థలాలు అందాయో తెలియడం లేదన్నారు. జర్నలిస్టుల ఇళ్లస్థలాలపైనా చర్చ జరిగిందని.. జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వివరించారు. ఒక గ్రూప్ కోసం ఎందుకు కన్సెషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందని, కాబట్టి సాధ్యాసాధ్యాలపై ఏజీతో చర్చిస్తామని మంత్రి పేర్కొన్నారు.