News27th Jun 12:28 PMSunil Byrisetty1 min read
రిలయెన్స్ కాంపాకు భూకేటాయింపులు
కర్నూలు సమీపంలో రిలయన్స్ భారీ పరిశ్రమకు భూమి కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రూ.1622 కోట్ల పెట్టుబడితో బేవరేజెస్, జ్యూస్ లు, డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ
కర్నూలు సమీపంలో రిలయన్స్ భారీ పరిశ్రమకు భూమి కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రూ.1622 కోట్ల పెట్టుబడితో బేవరేజెస్, జ్యూస్ లు, డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా 1200 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. విదేశీ పానీయాలు అయిన పెప్సి , కోక్ సంస్థలకి పోటీగా రిలయన్స్ దేశీయ శీతల పానీయ CAMPA ఉత్పత్తుల తయారీ ప్లాంట్ కోసం ఈ కేటాయింపులు జరిగాయి.