News8th May 12:01 PMSunil Byrisetty1 min read
కేఏ పాల్కు హైకోర్టు షాక్.. రూ.5 లక్షలు!
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు విషయంలో ఆయన దాఖలు చేసిన పిల్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఆ కేసును సీబీఐతో విచారణ జ
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్కు హైకోర్టు షాక్ ఇచ్చింది.
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు విషయంలో ఆయన దాఖలు చేసిన పిల్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
ఆ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని పిల్లో పాల్ కోరారు.
ఆ వ్యాజ్యాన్ని ఆయన సదుద్దేశంతోనే దాఖలు చేశారన్న రుజువు కోసం కోర్టు రిజిస్ట్రీ వద్ద రూ. 5 లక్షలు కట్టాలని సూచించింది.
ఆ సొమ్ము చెల్లించిన తర్వాతే విచారణ ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.
తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.