News30th Jul 03:56 PMSunil Byrisetty1 min read
ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల ఎంపిక ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపిక అయ్యిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బ్రూక్ఫీల్డ్, బ్లాక్స్టోన్, బ్లాక్రాక్, EQT, TPG వంటి గ్లోబల్ ప్రైవేట్ ఈక్విట
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపిక అయ్యిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బ్రూక్ఫీల్డ్, బ్లాక్స్టోన్, బ్లాక్రాక్, EQT, TPG వంటి గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని, టాటా పవర్, సుజ్లాన్, రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, ACME, వారీ వంటి ప్రముఖ భారతీయ కంపెనీలు ఇక్కడ విస్తరిస్తున్నాయని లోకేష్ వెల్లడించారు. పత్తికొండ సమీపంలోని హోసూరులో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) ఆధ్వర్యంలో రూ.5,350కోట్లతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటుచేయబోయే 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400% పెరిగిందని, ఇది రాష్ట్ర విశ్వసనీయతను పునరుద్ధరించడం వల్లే సాధ్యమైందన్నారు. టాటా రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ₹5,750 కోట్ల పెట్టుబడితో, పత్తికొండలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ను, అనంతపురం జిల్లా కనేకల్లులో 400 మెగావాట్ల పవన విద్యుత్తో కలిపి, 800 మెగావాట్ల హైబ్రిడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుగా అవ