Education20th Dec 11:41 AMSunil Byrisetty1 min read
బడులన్నీ 'ముస్తాబు'.. ఏపీలో వినూత్న కార్యక్రమం
పాఠశాల విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం 'ముస్తాబు' అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు
పాఠశాల విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం 'ముస్తాబు' అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసి సత్ఫలితాలు సాధించారు. అక్కడి విజయంతో స్ఫూర్తి పొందిన ప్రభుత్వం, దీన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలతో పాటు గురుకులాలు, వసతి గృహాలు, జూనియర్ కళాశాలల్లోనూ 'ముస్తాబు'ను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో కేవలం పరిశుభ్రతే కాకుండా, మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ వంటి సుగుణాలను అలవర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. కార్యక్రమ అమలుకు సంబంధించిన విధివిధానాలను వివరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.