News10th Dec 11:33 AMSunil Byrisetty1 min read
దేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రపథాన నిలుపుతాం
దేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రపథాన నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏఐ యుగంలో నైపుణ్యాలు, విశ్వాసం, రంగాల మార్పును సమన్వయం చేయడం అనే అంశంపై (Alig
దేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రపథాన నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏఐ యుగంలో నైపుణ్యాలు, విశ్వాసం, రంగాల మార్పును సమన్వయం చేయడం అనే అంశంపై (Aligning skills, Trust and Sectoral Transformation in the AI Era) శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. దేశంలోనే యువ రాష్ట్రాలలో ఏపీ ఒకటి. ప్రస్తుతం ఏపీ 180 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందన్నారు. భవిష్యత్ లో ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. 15 శాతం వృద్ధితోనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు క్లస్టర్ విధానంలో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, సీబీజీ, ఓట్స్, ఆక్వా, ఏఐ వంటి దాదాపు 20 రంగాలను గుర్తించామని వివరించారు. ఆయా రంగాలను క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేస్తాం. ఇందుకు కావాల్సిన ఎకో సిస్టమ్ ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కియా గ్లోబల్ ఉత్పత్తిలో 9 శాతం ఏపీ నుంచే వస్తోందని తెలిపారు. దేశంలో తయారయ్యే ఏసీల్లో 50 శాతం ఏపీ నుంచే తయారవుతున్నాయని, వచ్చే 24 నెలల్లో దీనిని 70శాతానికి తీసుకెళ్తామని లోకేష్ చెప్పారు.