News17th Jan 12:21 PMSunil Byrisetty1 min read
క్లీన్ ఎనర్జీలో చరిత్ర సృష్టించబోతున్న ఏపీ
ఏపీ బీజేపీ చీఫ్ పీవిఎన్ మాధవ్ కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు శంకుస్థాపనపై స్పందించారు. క్లీన్ ఎనర్జీలో ఏపీ చరిత్ర సృష్టించబోతోందంటూ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం పరికరాల న
ఏపీ బీజేపీ చీఫ్ పీవిఎన్ మాధవ్ కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు శంకుస్థాపనపై స్పందించారు. క్లీన్ ఎనర్జీలో ఏపీ చరిత్ర సృష్టించబోతోందంటూ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం పరికరాల నిర్మాణం ప్రారంభించడం నేడు గర్వించదగిన మైలురాయిని సూచిస్తుందన్నారు. ఇది ఏపీని గ్రీన్ ఎనర్జీ నికర ఎగుమతిదారుగా మార్చడానికి దగ్గరగా తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఈ 10 బిలియన్ డాలర్ల ఇంటిగ్రేటెడ్ పెట్టుబడిలో 7.5 గిగావాట్ల సోలార్-విండ్ కెపాసిటీ, 1 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఉన్నాయని వివరించారు. కాకినాడలో ఉత్పత్తి చేయబడిన గ్రీన్ అమ్మోనియా జర్మనీ , ఇతర ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి అవుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదే మొదటిదన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ చొరవను ప్రారంభించగలగడం పట్ల మాధవ్ హర్షం వ్యక్తం చేశారు.