News17th Jan 12:21 PMSunil Byrisetty1 min read

క్లీన్ ఎనర్జీలో చరిత్ర సృష్టించబోతున్న ఏపీ

ఏపీ బీజేపీ చీఫ్ పీవిఎన్ మాధవ్ కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు శంకుస్థాపనపై స్పందించారు. క్లీన్ ఎనర్జీలో ఏపీ చరిత్ర సృష్టించబోతోందంటూ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం పరికరాల న

క్లీన్ ఎనర్జీలో చరిత్ర సృష్టించబోతున్న ఏపీ
ఏపీ బీజేపీ చీఫ్ పీవిఎన్ మాధవ్ కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు శంకుస్థాపనపై స్పందించారు. క్లీన్ ఎనర్జీలో ఏపీ చరిత్ర సృష్టించబోతోందంటూ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం పరికరాల నిర్మాణం ప్రారంభించడం నేడు గర్వించదగిన మైలురాయిని సూచిస్తుందన్నారు. ఇది ఏపీని గ్రీన్ ఎనర్జీ నికర ఎగుమతిదారుగా మార్చడానికి దగ్గరగా తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఈ 10 బిలియన్ డాలర్ల ఇంటిగ్రేటెడ్ పెట్టుబడిలో 7.5 గిగావాట్ల సోలార్-విండ్ కెపాసిటీ, 1 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఉన్నాయని వివరించారు. కాకినాడలో ఉత్పత్తి చేయబడిన గ్రీన్ అమ్మోనియా జర్మనీ , ఇతర ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి అవుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదే మొదటిదన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ చొరవను ప్రారంభించగలగడం పట్ల మాధవ్ హర్షం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Clean Energy
Green Ammonia Project
Kakinada
BJP
PVN Madhav
Green Energy Exports
Solar and Wind Power
పంప్డ్ స్టోరేజ్ హైడ్రో
గ్రీన్ హైడ్రోజన్
ప్రపంచ ఎగుమతులు
Scroll for the next article