Education27th Jul 02:55 PMSunil Byrisetty1 min read
ఐఐటీల్లో సీట్లు.. విద్యార్థులకు ప్రోత్సాహకం
ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి యువత పట్ల తన మక్కువను చాటుకున్నారు. ఈ ఏడాది నుంచి ఐఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు తన సొంత డబ్బును ప్రోత్సాహకంగా అందించి వారి కృషి, పట్టుద
ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి యువత పట్ల తన మక్కువను చాటుకున్నారు. ఈ ఏడాది నుంచి ఐఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు తన సొంత డబ్బును ప్రోత్సాహకంగా అందించి వారి కృషి, పట్టుదలను గుర్తించాలని భావించారు. అంధులో భాగంగా దేశంలో ఏ ఐఐటీలో అయినా సీటు సాధించిన విద్యార్థులకు తన సొంత నిధులను ప్రోత్సాహకంగా అందిస్థానని ప్రకటించారు. ఎస్టీ విద్యార్థులకు 1,00,000, ఎస్సీలకు 75,000, బీసీలకు 50,000, ఓసి విద్యార్థులకు 25,000 రూపాయలు తన సొంత డబ్బునుంచి ఇస్తానని ప్రకటించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి కన్నవారికి దేశానికి మంచి పేరు తేవాలని తన వంతుగా ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు.