News1st Apr 05:58 PMSunil Byrisetty1 min read

ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు

రాష్ట్రంలో ఏటీఎం కార్డు సైజులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఇకపై రేషన్ కార్డులను విడిగా పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏటీఎంలతోపాటు జేబులో తీసుకెళ్లే సైజులో ప్రభుత్వం

ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు
రాష్ట్రంలో ఏటీఎం కార్డు సైజులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఇకపై రేషన్ కార్డులను విడిగా పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏటీఎంలతోపాటు జేబులో తీసుకెళ్లే సైజులో ప్రభుత్వం కొత్తవి తయారు చేయనుంది. ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ల్పిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని అన్నారు. గత ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు. ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
Andhra pradesh
Atm Sized Ration Crads
నాదెండ్ల మనోహర్
Scroll for the next article