News8th Sep 04:17 PMSunil Byrisetty1 min read
డీ-మార్ట్కు పోటీగా వెయ్యి మీ-మార్ట్లు
డీ-మార్ట్కు పోటీగా మీ-మార్ట్లు సిద్ధం చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అక్టోబర్ 1న వెయ్యి మీ-మార్ట్లు ప్రారంభిస్తామ
డీ-మార్ట్కు పోటీగా మీ-మార్ట్లు సిద్ధం చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అక్టోబర్ 1న వెయ్యి మీ-మార్ట్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. ‘మీ మార్ట్ - నీది నాది మనందరిది’ అనే నూతన ఆలోచనతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇప్పటికే ఎన్సీసీఎఫ్(నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్)తో ఒప్పందం కుదుర్చుకుంది. జిల్లాలో ముందుగా సుమారు వంద మార్ట్ల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సాధారణ ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను మార్కెట్ కంటే తక్కువ ధరలకే అందించనున్నారు.