Education23rd Jul 09:30 AMSunil Byrisetty1 min read
ఆంధ్రా యూనివర్సిటీలో క్వాంటం కోర్సు
విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ క్వాంటం కంప్యూటింగ్ కోర్సు ప్రవేశపెట్టేందుకు ఏయూ సెనేట్ ఆమోదం తెలిపింది. ఈ కోర్సులో చేరేందుకు ఈఏపీసెట్ ద్వారా ప్రవేశా
విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ క్వాంటం కంప్యూటింగ్ కోర్సు ప్రవేశపెట్టేందుకు ఏయూ సెనేట్ ఆమోదం తెలిపింది. ఈ కోర్సులో చేరేందుకు ఈఏపీసెట్ ద్వారా ప్రవేశాలు చేపట్టనుంది. సెనేట్ సమావేశంలో నూతన కోర్సు ప్రారంభానికి సభ్యులు ఆమోదం తెలిపారు. తొలి బ్యాచ్లో 30 మందికి అడ్మిషన్స్ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అతికొద్ది విశ్వవిద్యాలయాల్లో నిర్వహిస్తున్న ఈ కోర్సును ఏయూలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.