News12th Jan 12:07 PMSunil Byrisetty1 min read
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఏబీవీ అడుగులు
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పురోగతే లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటుకు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సన్నాహాలు చేస్త
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పురోగతే లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటుకు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’లో ఆయన ప్రసంగించారు. గత ఏడాది ఏప్రిల్ 13న రాజకీయ ప్రవేశంపై చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని, అప్పటి నుంచి పార్టీ ఏర్పాటుకు అవసరమైన కసరత్తు చేస్తున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. తగిన ఆర్థిక శక్తిని సమకూర్చుకున్న తర్వాత పార్టీని ప్రారంభిస్తానని పేర్కొన్నారు. అలాగే, స్వేచ్ఛగా అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకోవడానికి విజయవాడలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అంతర్జాతీయంగా అగ్రరాజ్యాలు చిన్న దేశాలపై దాడులు చేస్తున్న ప్రస్తుత తరుణంలో భారతదేశం బలంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి అంటే కేవలం కార్పొరేట్ శక్తుల ఎదుగుదల మాత్రమే కాదని, సామాన్య ప్రజలందరూ ఆర్థికంగా ఎదగడమే నిజమైన దేశాభివృద్ధి అని ఏబీవీ అభిప్రాయపడ్డారు.