News23rd Jul 09:25 AMSunil Byrisetty1 min read
కేంద్ర మంత్రి బిజెపి ఎపి చీఫ్ మాధవ్ భేటీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో వీరి మధ్య చర్చ జరిగ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్ర రాజధాని నిర్మాణం తదితర అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించారు. గత వైసీపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం నిధులు దారి మళ్లించి అభివృద్ధి లేక అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ఎన్డీఎ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి దిశగా వెళుతోందని మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మంత్రి వద్ద ప్రస్తావించారు. కేంద్రం సాయం అందించాలని కోరారు.