News9th Jan 03:20 PMSunil Byrisetty1 min read
ఎంఎస్ఎంఈల బలోపేతం దిశగా “క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం”
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSMEs) ను అభివృద్ధి పర్చాలనే లక్ష్యంతో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన “ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (AP-CDP)” క
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSMEs) ను అభివృద్ధి పర్చాలనే లక్ష్యంతో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన “ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (AP-CDP)” కు మంత్రి మండలి ఆమోదం లభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCలు) స్థాపించబడతాయని తెలిపారు. ఈ సెంటర్స్ ద్వారా ప్రింటింగ్, అగ్రి-బేస్డ్, గోల్డ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో సాంకేతిక సదుపాయాలు, ప్యాకేజింగ్ యూనిట్లు, జాబ్ వర్క్ ఫెసిలిటీస్ ఏర్పాటు కానున్నాయన్నారు. ఈ కేంద్రాలు పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, సుమారు 1,840 MSME యూనిట్లకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు 7,500కు పైగా ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కలుగనున్నట్లు మంత్రి తెలిపారు.