News3rd Apr 03:44 PMSunil Byrisetty1 min read

జలహారతి కార్పొరేషన్.. ఏపి కేబినెట్లో కీలక అంశాలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను.. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి

జలహారతి కార్పొరేషన్.. ఏపి కేబినెట్లో కీలక అంశాలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను.. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. అనకాపల్లి జిల్లాలోని డీఎలపురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు ఆమోదం పలికింది. బార్ లైసెన్స్‌ల ఫీజును రూ. 25 లక్షలకు కుదిస్తూ ఆమోదం ప్రకటించింది. అలాగే యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్‌కు ఆమోదం తెలిపింది. రూ.710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు-2025కి ఆమోదం పలికింది. నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదించడంతోపాటు, జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేసేందుకు కేబినెట్ ఆమోదం ప్రకటించింది.
AP Cabinet Meeting
Cabinet
CM Chandrababu
Andhra Pradesh
క్యాపిటివ్ పోర్టు
ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్
Scroll for the next article