News25th Dec 04:06 PMSunil Byrisetty1 min read
సైబర్ ముఠా గుట్టురట్టు చేసిన ఏపీ సీఐడీ
అంతర్జాతీయ ముఠా నెట్ వర్క్ ను ఏపీ సీఐడీ పోలీసులు ఛేదించారు. కంబోడియా దేశం నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాారు. ఏపీలోని విశాఖపట్నంతో పాటు బెంగాల్, ఒడిశా కేంద్రంగా నేరా
అంతర్జాతీయ ముఠా నెట్ వర్క్ ను ఏపీ సీఐడీ పోలీసులు ఛేదించారు. కంబోడియా దేశం నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాారు. ఏపీలోని విశాఖపట్నంతో పాటు బెంగాల్, ఒడిశా కేంద్రంగా నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు చెందిన నేరస్తుడిని పశ్చిమ బెంగాల్ లో అరెస్టు చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. నిందితుడి దగ్గరి నుంచి 1400 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, బెంగాల్, ఒడిశాలలో సిమ్ బాక్స్ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.