News6th Oct 04:14 PMSunil Byrisetty1 min read

పిఠాపురానికి పవన్ కల్యాణ్.. పలు జిల్లాల్లో పర్యటనలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నెలలో ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా

పిఠాపురానికి పవన్ కల్యాణ్.. పలు జిల్లాల్లో పర్యటనలు
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నెలలో ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తన పర్యటనను అక్కడి నుంచే ప్రారంభించాలని పవన్ నిర్ణయించారు. కురుపాం వెళ్లి ఆ పాఠశాలను పరిశీలించడంతో పాటు, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంతో పాటు ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కూడా పర్యటించనున్నారు. అలాగే, తన శాఖకు సంబంధించిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజోలు నియోజకవర్గానికి వెళ్లనున్నారు. పర్యటనల సమయంలో మొదట అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, ఆ తర్వాత స్థానిక జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
Andhra Pradesh Deputy CM
Pawan Kalyan
Panchayati Raj Minister
Field Visit
District Tour
Kurupam Gurukul School
Students Health
Pithapuram
Prakasam District
SPSR Nellore
Rajolu Constituency
Jana Sena Party
జనసేన పార్టీ
ప్రభుత్వ కార్యక్రమం
Scroll for the next article