Spiritual16th Aug 03:38 PMSunil Byrisetty1 min read
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన డీజీపీ
విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి విచ్చేసిన రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన డీజీపీ దంపతులకు ఆలయ మర్యాదలతో చైర్మన్ బొర్రా ర
విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి విచ్చేసిన రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన డీజీపీ దంపతులకు
ఆలయ మర్యాదలతో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ శీనా నాయక్ ఘన స్వాగతం పలికారు. డీజీపీకి అమ్మవారి
ఆశీర్వాద మండపంలో వేద పండితులు సంప్రదాయబద్ధంగా వేదాశీర్వచనం అందించారు.
చైర్మన్ బొర్రా రాధాకృష్ణ,, ఈఓ శీనా నాయక్ కలిసి డీజీపీ కి అమ్మవారి శేషవస్త్రం, పవిత్ర లడ్డు ప్రసాదం అమ్మవారి చిత్రపటం జ్ఞాపికను బహూకరించారు. డీజీపీ మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు.