News22nd Nov 05:58 PMSunil Byrisetty1 min read

మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన ప్రభుత్వం

మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రభుత్వం నియమించింది. నియామకాల్లో పొత్తు ధర్మం పాటిస్తూ, అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కల్యాణం శ

మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన ప్రభుత్వం
మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రభుత్వం నియమించింది. నియామకాల్లో పొత్తు ధర్మం పాటిస్తూ, అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కల్యాణం శివశ్రీనివాసరావు, ఏపీ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ చైల్డ్ లేబర్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సత్యనారాయణ రాజు, ఏపీ అఫిషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఛైర్మన్‌గా విక్రమ్, ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మౌలానా షిబిలీలను నియమించింది. అలాగే ఫిషర్‌మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా రామ్ ప్రసాద్, పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా మధుబాబు, స్టేట్ రెడ్డిక వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా శంకర్‌రెడ్డి, కుర్ని, కరికాలభక్తుల వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మిన్నప్ప, షేక్, షీక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా ముక్తియార్ , భట్రాజ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వెంకటేశ్వరరాజు, పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా వీరభద్రరావులను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. త్వరలో మిగిలిన పదవులను కూడా భర్తీ చేయనుంది.
Andhra Pradesh
Corporations
Chairperson Appointments
Coalition Government
Welfare Corporations
11 కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్‌ల నియామకం
Scroll for the next article