Politics3rd Mar 05:19 PMSunil Byrisetty1 min read

భ‌వ‌న నిర్మాణ‌దారుల‌కు ఏపీ ప్రభుత్వం శుభ‌వార్త

భ‌వ‌న నిర్మాణ‌దారుల‌కు ఏపీ ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై 18 మీట‌ర్ల లోపు లేదా ఐదంత‌స్తుల లోపు భ‌వ‌నాల నిర్మాణాల‌ అనుమతులకు స్వీయ ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇస్తే స‌రిపోతుంది. టౌన్ ప్ల

భ‌వ‌న నిర్మాణ‌దారుల‌కు ఏపీ ప్రభుత్వం శుభ‌వార్త
భ‌వ‌న నిర్మాణ‌దారుల‌కు ఏపీ ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై 18 మీట‌ర్ల లోపు లేదా ఐదంత‌స్తుల లోపు భ‌వ‌నాల నిర్మాణాల‌ అనుమతులకు స్వీయ ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇస్తే స‌రిపోతుంది. టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఎలాంటి అనుమ‌తి అవ‌స‌రం లేకుండానే భ‌వ‌న నిర్మాణాల‌కు ప‌ర్మిష‌న్ వ‌చ్చేస్తుంది. కాక‌పోతే భ‌వ‌న య‌జ‌మానులు రిజిస్ట‌ర్డ్ ఎల్ టీపీలు,ఇంజినీర్లు లేదా ఆర్కిటెక్ట్ ల స‌మ‌క్షంలో స‌రైన ప‌త్రాలు స‌మ‌ర్పించి స్వీయ ధృవీక‌రణ(అఫిడ‌విట్)ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గ‌త నెల‌లోనే భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల‌కు కొత్త విధానం అమ‌ల్లోకి తీసుకొస్తూ ప్ర‌భుత్వం జీవో జారీ చేసిన‌ప్ప‌టికీ సాంకేతిక కార‌ణాల‌తో జాప్యం జ‌రిగింది. భ‌వ‌న నిర్మాణాల అనుమతుల ప్ర‌క్రియ‌ను త్వ‌రిత‌గ‌తిన జారీ చేసేలా ఈ కొత్త విధానాన్ని స‌ర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సెల్ఫ్ స‌ర్టిఫికేష‌న్ ద్వారా నిర్మాణాల‌కు అనుమ‌తులిచ్చేందుకు అవ‌స‌ర‌మైన సాఫ్ట్ వేర్ ను APDPMS పోర్ట‌ల్ లోకి అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు. ఈ విధానం ఆమోదం పొందిన లేఅవుట్లు, గ్రామ కంఠం,స‌ర్కులేష‌న్ ప్లాన్లు ఉన్న ప్రాంతాలు,1985కు ముందు నిర్మించిన భ‌వ‌నాల పున‌ర్మిణానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మంత్రి చెప్పారు.
CM Chandra babu
AP News
politics
Scroll for the next article