News21st Jul 04:27 PMSunil Byrisetty1 min read

రామాయపట్నం పోర్టుపై వైసీపీ మైండ్ గేమ్‌ అట్టర్‌ ఫ్లాప్‌

రామాయపట్నం పోర్టును కూటమి ప్రభుత్వం అమ్మేస్తోందంటూ వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోయింది. కేవలం రాజకీయాల కోసమే వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్త

రామాయపట్నం పోర్టుపై వైసీపీ మైండ్ గేమ్‌ అట్టర్‌ ఫ్లాప్‌
రామాయపట్నం పోర్టును కూటమి ప్రభుత్వం అమ్మేస్తోందంటూ వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోయింది. కేవలం రాజకీయాల కోసమే వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని మరోసారి తేటతెల్లమయింది. పోర్టును ప్రైవేటీకరించడం లేదని, కేవలం నిర్వహణ బాధ్యతలను మాత్రమే పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ - PPP పద్ధతిలో గ్లోబల్ టెండర్ల ద్వారా అవుట్‌సోర్స్ చేస్తున్నారనే నిజాన్ని వైసీపీ దాస్తోంది. ఈ PPP మోడల్ వల్ల ప్రభుత్వానికి ₹1,500 కోట్ల ముందస్తు ప్రీమియంతో పాటు, పోర్టు ఆదాయంలో మేజరు వాటా, 12 శాతం ఈక్విటీ లభిస్తాయి. పైగా రాబోయే రోజుల్లో పోర్టు విస్తరణకు కావాల్సిన ₹16,000 కోట్ల భారీ పెట్టుబడిని కూడా ప్రైవేట్ భాగస్వామే భరించాల్సి ఉంటుంది. కేవలం ఆపరేషన్స్ & మెయింటెనెన్స్ నిర్వహించే విధానాన్ని అమ్మేయడం అని ప్రచారం చేయడం ఫ్యామ్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు అద్దంపడుతోంది. జగన్ హయాంలో ఈ పోర్టు పనులు సగం కూడా పూర్తికాకుండా, వందల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి ప్రాజెక్టును పడకేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేసింది. ఈ క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కుతుందోననే భయంతో వైసీపీ తప్పుడు కథనాలను అల్లుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Andhra Pradesh
Ramayapatnam Port
YSRCP
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
పీపీపీ మోడల్
పోర్టు అభివృద్ధి
ఏపీ రాజకీయాలు
మౌలిక సదుపాయాలు
Scroll for the next article